ముంబయిలో భవంతి కూలిన ఘటనలో 7 కు చేరిన మృతుల సంఖ్య

ముంబయి,(జనంసాక్షి):భారీ వర్షాలకు సెంట్రల్‌ ముంబయిలోని మహిమ ప్రాంతంలో సోమవారం రాత్రి ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను బాంద్రాలోని బాబా ఆసుపత్రికి తరలించారు.