ముంబయిలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

ముంబయి: ముంబయిలో నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారు అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి అందిన సమాచారంతో ఎస్‌.ఐ.ఎ,ఐ.టి. అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారం అభరణాలను ముంబయి సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో వలపన్ని పట్టుకున్నారు. ఈకేసుకు సంబంధించి దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి గుజరాత్‌లోని వేర్వేరు పట్టణాలకు వీటిని తరలిస్తున్నట్లు ఎస్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.