ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో  పలువురు గాయపడినట్లు సమాచారం కూలిన వంతెన శిధిలాల కింద కూలీలు ఇరుక్కునట్లు తెలుస్తోంది, గాయపడినవారిని చికిత్సకోసం కూపర్‌, దేశాయ్‌ ఆస్పత్రుల్లో చేర్చారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.