ముంబయి చేరుకున్న మనీషా కోయిరాలా

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాల బుధవారం సాయంత్రం ముంబయి చేరుకున్నారు. గత ఏడు నెలలుగా ఆమె అమెరికాలో ఉండి క్యాన్సర్‌కి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ముంబయి చేరుకున్న ఆమె నేరుగా వెర్సోవాలోని తన ఇంటికి వెళ్లారు. మనీషా వెంట స్నేహితురాలు, నటి దీప్తి నావల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ 42 ఏళ్ల వయసులో మనీషా ఆత్మస్లైర్యంతో క్యాన్సర్‌ జయించారని, ఆమె పూర్తి అరోగ్యంగా ఉన్నారని చెప్పారు. బంధువుల వివాహానికి అమెరికా వెళ్లిన తాను మనీషాతో మాట్లాడి ఒకే రోజున కలిసి రావడానికి ప్లాస్‌ చేసుకున్నామని తెలిపారు.