ముగిసిన చర్చలు: ట్యాంక్బండ్ పైనే కవాతుకు ఐకాస పట్టు
హైదరాబాద్: తెలంగాణ ఐకాస నేతలతో మంత్రులు సబిత. సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్ల చర్చలు ముగిశాయి. చర్చల వివరాలను సీఎంకు వివరించేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్కుమార్లు బయటకు వచ్చారు. ట్యాంక్బండ్పైనే కవాతు నిర్వహిస్తామని, నెక్టెస్రోడ్డులో కవాతుకు అనుమతి ఇవ్వాలని ఐకాస నేతలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది.