ముగిసిన టీ జేఏసీ సమావేశం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ సమావేశం ముగిసింది. ఇవాళ హస్తినలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పన్నెండు జాతీయ పార్టీల నేతలు, ఏడుగురు ఎంపీలు హాజరయ్యారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను మాత్రమే ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.