ముగిసిన పోలింగ్‌: 58.56 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని పది నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ పది నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మొత్తం 58.56 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, ఛత్తీస్‌ గఢ్‌ లోని 8 జిల్లాల్లో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌ గఢ్‌ లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగింది.