ముదిరాజ్ ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయండి

ముదిరాజ్ ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయండి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ పిట్టల అశోక్ ముదిరాజ్
ముదిరాజ్ లకు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఒక్క సీటు కేటాయించకుండ విస్మరించిన బిఆర్ స్ పార్టీ ని తెలంగాణాలో బొంద పెట్టడం ఖాయమని, ఈ నేల 8వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ ను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ పిట్టల అశోక్ ముదిరాజ్ కోరారు. స్థానిక భువనగిరి రహదారి బంగ్లా లో సభ కు సంబంధించిన గొడ పత్రిక ముదిరాజ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కు చట్ట సభల్లో రాజకీయ ప్రాతినిథ్యం లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, గత రెండు ఎన్నికల్లో ముదిరాజ్ ఒట్ల తో గెలిచిన కేసిఆర్ కు ఈసారి భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ముదిరాజ్ లకు న్యాయపరంగా, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ బిసి డి నుండి ఎ కు డిమాండ్ ను కేసిఆర్ ప్రభుత్వం తొక్కి పట్టిందని, మత్స్యకారులు గా ఉన్న ముదిరాజ్ లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు పైగా కేంద్ర ప్రభుత్వ నిధులను గత తొమ్మిది సంవత్సరాలుగా అడ్డుకుంటుందని వారు ఆరోపించారు. ఇంటికోకరి చోప్పున లక్షలాదిగా తరలి వచ్చి ముదిరాజ్ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పల్లెపాటి సత్యనారాయణ, కుక్కదువు సోమయ్య, పిట్టల బాలరాజ్, ఎనబోయిన జహంగీర్, బీసుకుంట్ల సత్యనారాయణ, ఉడుత భాస్కర్, దాసమోని వేంకటేష్, ధ్యానబోయిన సత్యనారాయణ, ఆకుల రమేష్, తుమ్మల నగేష్, గోదాసు లింగ స్వామి చిక్కుల వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.