మున్సిపల్ సమావేశంలో పలు తీర్మానాల ఆమోదం జనంసాక్షి, మంథని

మంథని మున్సిపల్ కార్యాలయములో చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ సి. హెచ్ సతీష్ శనివారం నిర్వహించారు. మంథని పురపాలక సంఘ కార్యాలయ భవనకు దక్షిణం వైపు ప్రహరీ గోడ నిర్మాణం చేయుటకు ఆమోదం గురించి, ఉప్పట్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎఫ్.ఎస్.టి.పి నిర్మాణమునకు అవసరమగు కరెంటు ఏర్పాటు చేయుట గురించి, మంథని పురపాలక సంఘం పరిధిలోని బోయినపేటలో ఉండబడిన పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలమును గొల్లగూడెం యాదవ సంఘం నాకు కేటాయించుటకు పరిపాలన ఆమోదం గురించి, మంథని పురపాలక సంఘం పరిధిలోని డంప్ యార్డ్ వద్ద ఇనుప రేకులతో ప్రహరీ గోడ నిర్మాణం చేయుటకు ఆమోదం గురించి, గౌతమి తాపీ వర్కర్స్ యూనియన్ మంథని గారికి ఇంటి పన్ను విధించి సర్టిఫికేట్ పంపిణీ చేయడం జరిగింది. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. మంథని లక్ష్మీ విరమణ సన్మాన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమములో మంథని మున్సిపల్ కు అవసరమగు అంశాలను కౌన్సిల్ సభ్యులతో చర్చించి ఆమోదం తీసుకున్నారు.