మూడు బ్యాంకులకు జరిమానా

ఢిల్లీ : ఖాతాదారుల నియమావళి ఉల్లంఘించినందుకు మూడు బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిమానా విధించింది. యాక్సిస్‌ బ్యాంకుకు రూ. 5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. కోటి జరిమానా విధించింది. అయితే ఈ మూడు బ్యాంకులు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయన్న కోబ్రా పోస్టు కథనానకి ఎలాంటి ఆధారాలు లేవనీ ఆర్‌బీఐ పేర్కొంది.