మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్‌

16brk57aతమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న ఓటింగ్

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉదయం నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. తమిళనాడులో 234 నియోజకవర్గాలుండగా..232 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. తంజావూరు, అరవకురిచ్చిలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలు రావడంతో పోలింగ్ వాయిదా పడింది. మరోవైపు కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చెరీలోని 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఈసీ… ఓటింగ్ శాతం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంది.