మృతుడి కుటుంబానికి భరోసా

మృతుడి కుటుంబానికి భరోసా

వనపర్తి బ్యూరో అక్టోబర్02 (జనంసాక్షి)మృతుడి కుటుంబానికి ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి గారు భరోసాను ఇచ్చారు . పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన
బిఆర్ ఎస్ నాయకుడు ఆడేం బాలయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు .విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి మృతుని ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆడేం బాలయ్య మృతి వారి కుటుంబానికి తీరని లోటని వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారికి మనోదైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు