మృతురాలి అంత్యక్రియల కోసం ఐదు వేల ఆర్థిక సహాయం.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దీపా నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 30 (జనం సాక్షి)మున్సిపల్ కార్మికురాలు అంతారం గ్రామానికి చెందినతాండ్ర దస్తమ్మ శనివారం ఉదయం మృతి చెందారు. విషయాన్ని గ్రామ ఉపసర్పంచ్ నక్కల జీవరత్నం ద్వారా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టోళ్ల దీప నర్సింహులుకు సమాచారం అందజేశారు. సమాచారం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకొని మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా అంతక్రియల కోసం ఐదు వేల రూపాయల ఆర్థికసాయని అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ గత కొంతకాలంగా మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేయడం జరుగు తుందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు అనేక విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తు న్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మృతురాలు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ పెండ నరసింహులు. గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఎం.వెంకటయ్య జే ప్రభాకర్ . మంబాపురం బందప్ప,కాంగ్రెస్ పార్టీకి చెందిన జంగని మొగులయ్య తదితరులు ఉన్నారు.