మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

వనపర్తి బ్యూరో అక్టోబర్03 (జనంసాక్షి)మృతుల కుటుంబాలకు ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి అన్నారు . ఖిల్లా ఘనపురం మండలం అల్లమాయ పల్లి గ్రామంలో తెలుగు భద్రు సతీమణి మన్నెమ్మ , బదుగని శేషయ్యలు ఇటీవల అకాల మరణం చెందారు. మంగళవారం నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి వారి నివాస గృహాల వద్దకు వేర్వేరుగా వెళ్లి పరామర్శించారు అనంతరం వేరువేరుగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ను అందచేశారు . కండ్ల ముందు ఉంటూ అకాల మరణం చెందడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని భగవంతుడు వారికి మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట గ్రామ బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు