మెట్రో రెండోదశకు అనుమతుల్విండి
` కేంద్రమంత్రి ఖట్టర్తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వినతి
` హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఇదే పరిష్కారం
` 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్-2 డిపిఆర్ అందజేత
` బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తోనూ చర్చలు
న్యూఢల్లీి(జనంసాక్షి): మెట్రో రెండోదశకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢల్లీిలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోవిూటర్ల పొడవైన మెట్రో ఫేజ్-2 అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా కొనసాగడంతో పాటు రహదారులపై రద్దీ కూడా తగ్గుతుందని వెల్లడిరచారు. అలాగే, సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-ఎఎ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ భేటీ అయ్యారు. గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే ’తెలంగాణ రైజింగ్ 2027’ కార్యక్రమం వివరాలను సీఎం టోనీ బ్లెయిర్కు అందించారు. రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కోర్ అర్బన్, పెరి-అర్బన్, గ్రావిూణ మండలలాతో మైక్రోప్లానింగ్కి సంబంధించిన విషయాలను టోనీతో పంచుకున్నారు. అనంతరం టోనీ బ్లెయిర్ మాట్లాడుతూ.. అభివృద్ధి అజెండా స్థిరత్వ సూత్రాల ద్వారానే సాధించవచ్చన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై టోనీ ª`లబెయిర్ ప్రత్యేక ఆసక్తి కనబరిచారని సీఎం కార్యాలయం పేర్కొంది. తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం, టోనీ ª`లబెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది.