మెట్ల చిట్టాపూర్ లో ఇథైనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మెట్ పల్లిలో భారీ ర్యాలీ

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 16,
జనంసాక్షి :
మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 498 మరియు 506 లలో ఇండస్ట్రియల్ పార్క్ మరియు ఇథైనాల్ పార్క్ ఏర్పాటుకి ప్రభుత్వ ప్రభుత్వ ప్రయత్నాలకి వ్యతిరేకంగా గ్రామస్థులు మెట్ పల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం 12 గంటలకు మార్కెట్ యార్డ్ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీలో గ్రామస్థులతో పాటు అఖిలపక్షానికి చెందిన నాయకులు కంతి మోహన్ రెడ్డి, జంగిలి సునీత, సురభి నవీన్ రావ్, కొమిరెడ్డి కరం, పుప్పాల లింబాద్రి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు కంతి మోహన్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడ్డ బడుగు, బలహీన వర్గాలకి చెందిన రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచినట్టే ఇచ్చి, నకిలీ ఫ్యాక్టరీల ఏర్పాటు పేరిట తిరిగి లాక్కోవడం దారుణం అన్నారు. పట్టాదారులకు కనీసం ఎలాంటి నోటీసులు, సమాచారం లేకుండానే వారి భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేస్తూ, స్వాధీనపరచుకోవడం పేదల పొట్టకొట్టడమే అన్నారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్ కి రైతులు,పట్టాదారులతో కలసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ జేఏసీ నాయకులు పులి సంజీవ్, చింతకుంట దేవేందర్, గొర్రె భీమన్న, రాధారపు హరికృష, అఖిలపక్షం నాయకులు అల్లూరి మహేందర్ రెడ్డి, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పసునూరి శ్రీనివాస్, చింతకుంట శంకర్, బొడ్ల రమేష్ , ఎలుక కమలాకర్, రైసోద్దీన్, కంతి రమేష్, జిల్లాపెల్లి దిలీప్, వన్నెల శశి, తదితరులు పాల్గొన్నారు.