మేం బుల్లెట్లతో సమాధానం చెబుతున్నాం: యోగి

జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో టెర్రరిస్టులు తినేందుకు బిర్యానీ వడ్డించారని.. ఇప్పుడు తాము వాళ్ల గుండెల్లోకి బుల్లెట్లు దించుతున్నామన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. మక్రానా ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ విభజించి, పాలించు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వాళ్ల పాలనలో కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు చేసింది. దాని ఫలితంగా దేశంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. ముంబయిలో 26/11 దాడులు కాంగ్రెస్‌ హయంలోనే జరిగాయన్నారు. టెర్రరిస్టులకు కాంగ్రెస్‌ బిర్యాని తినిపిస్తే.. ప్రస్తుతం తాము అదే ఉగ్రవాదులకు బుల్లెట్లు తినిపిస్తున్నామని యోగి అన్నారు.