మైసమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ గా సిద్దగోని కృష్ణ

మైసమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ గా సిద్దగోని కృష్ణ

చింతపల్లి అక్టోబర్ (జనం సాక్షి )
చింతపల్లి మండలంలో పోలేపల్లి రాంనగర్ కు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్దగోని కృష్ణ గౌడ్ పోలేపల్లి రాంనగర్ వన మైసమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువా తో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పోలేపల్లి సర్పంచ్ కాసోజు బ్రహ్మచారి, ఉపసర్పంచ్ ఈరటి శేఖర్ యాదవ్,మాజీ ఎంపీటీసీ మునుకుంట్ల శేఖర్,మాజీ చైర్మన్ కొప్పుల యాదయ్య గౌడ్, కె జంగయ్య, దొంతగోని శేఖర్, నరేష్,ఉకోండి గిరి,ఎంపిటిసి వసంత్ నవీన్,మాదార్,కొప్పుల రాములు,కొర్ర రమేష్,కాసానిపవన్, తదితరులు పాల్గొన్నారు