మోడీకి నా ఆశీస్సులు: జయలలిత

చెన్నై : నరేంద్రమోడీ మిత్రుడని ఆయనకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మోడీ భాజపా ఎన్నికల ప్రచార సారథిగా నియమితులవడంపై ఆమె స్పందించారు. రాజకీయంగా అది వారి పార్టీ వ్యవహారమన్న జయలలిత వ్యక్తిగత స్థాయిలో తాము మంచి మిత్రులమని, పాలనా దక్షుడిగా ఆయన పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయనకు అంతా మంచి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.