మోడీ ప్రచారానికి బీహార్తో శ్రీకారం
ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి హోదాలో నరేంద్రమోడీ తన కొత్త బాధ్యతకు బీహార్తో శ్రీకారం చుట్టునున్నారు. బీహార్కు చెందిన 1500 మంది పార్టీ నేతలతో రేపు నరేంద్ర మోడీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులో అయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సందర్శించనున్నారు. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ ఇటీవలే భాజపాతో పొత్తు వదులు కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బీహార్ నుంచి తన ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.