మోడీ వివాదంతో జేడీయూలో చీలిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నరేంద్ర మోడీ వివాదంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎన్టీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ చెబుతుంటే, మరోవైపు నితీష్‌ కుమార్‌ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్‌లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్టీయేలో కొనపాగడంపై జేడీయూ సస్పెన్స్‌ కొనసాగుతుంది.