మోడీ విశాఖ పర్యటన వాయిదా

అమరావతి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈనెల 16న విశాఖలో పర్యటిస్తారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఆయన పర్యటన 16వ తేది కంటే ముందే ఉండొచ్చనే సంకేతాలు అందాయి. అయితే ఇవేవీ కాకుండా ఆయన ఈనెల 27న విశాఖ వస్తారని, గుంటూరు పర్యటన మాత్రం షెడ్యూల్‌ ప్రకారం 10న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటన కారణంగా ఆయన విశాఖ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లో ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.