మోదీ సభలో నిరసన తెలుపుతాం

– ఖాళీ పిడతలతో ప్రధానికి స్వాగతం పలకాలి
– చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతాం
– ప్రత్యేక ¬దా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని
విశాఖపట్టణ, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో పూర్తిగా పక్కన పెట్టేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తామని, అదే సమయంలో విభజన హావిూ కోసం ఢిల్లీలో దీక్ష చేయనున్న సీఎం చంద్రబాబుకు మద్దతు తెలుపుతామని ప్రత్యేక ¬దా, విభజన హావిూ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. విశాఖలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం విభజన హావిూలన్నీ అమలు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని, ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు సభకు రానున్న ప్రధానికి ఖాళీ పిడతలతో స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఏపీ తమకు రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగపడదన్న ఉద్దేశంతోనే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆధ్యాత్మిక సన్నిధానానికి భక్తులను తీసుకువెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఖాళీగా వెళ్తుండడం చూస్తే రైల్వేలో నిర్వహణలోపం ఎలా ఉందో అర్థమవుతోందని, ఇప్పటికైనా ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీలో రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి ఏపీకి అనుకూలంగా ఉంటే, మోదీ, అమిత్‌షా, జైట్లీలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భారతీయులను విభజించి పాలించాలని చూడడం దారుణమన్నారు.