యాత్రికులకు రూ. 2వేలు చొప్పున అందించిన అధికారులు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీలో చేరి ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు రూ. 2వేల చొప్పున అధికారులు సాయం అందించారు. దుస్తులు, ఇతర సామాగ్రి కోసం యాత్రికులకు రూ. 2వేలు అందించాల్సిందిగా ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.