యాత్రికులను తరలించేందుకు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

ఢిల్లీ : చార్‌ధామ్‌ యాత్రికులను ఏపీభవన్‌ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు రైల్వే శాఖ అదనపు బోగీలు ఏర్పాటుచేసింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 4 బోగీలు, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు 2 బోగీలు, గోవా ఎక్స్‌ప్రెస్‌, గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లకు చెరో బోగీ ఏర్పాటుచేశారు. జనం లేకపోవడం వల్లే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయలేకపోతున్నామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు.