యువతి అదృశ్యం. కేసు నమోదు

జుక్కల్, పిబ్రవరి 15,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన ఒడ్డె అక్షర అదృశ్యమైందని, ఆమె తల్లి ఒడ్డె పాపవ్వ పిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాములు తెలిపారు. వివరాలు ఈ విదంగా వున్నాయి. సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఇంట్లోనే పడుకొని ఉంది. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు ఆమె తల్లి లేచి చూడగా కూతురు అక్షర కన్పించలేదు.ఈ విషయమై ఆ రోజంతా గాలించినా కూతురి ఆచూకి దొరకక పోవడంతో పోలీసులకి పిర్యాదు చేసింది.