యూపిలో పట్టాలు తప్పిన రైలు

ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు

లక్నో,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని దమోరా, దుగ్గన్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలులోని ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే ఆ రైలులో ప్రయాణికులు లేని కారణంగా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఖాళీ బోగీలతో వెళ్తున్న రైలు బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. దీంతో ఆ రూట్లో ఉన్న డౌన్‌ లైన్‌ బ్లాక్‌ అయ్యింది. మొరాదాబాద్‌, బరేలీ జంక్షన్ల మధ్య నడిచే రైళ్లను రూటు మార్చారు. ఇప్పుడా రైళ్లు మొరాదాబాద్‌-చాందౌసి-బరేలీ మధ్య నడుస్తాయి. రైలు పట్టాలు తప్పడం వల్ల ఆ రూట్లో వెళ్లే సుమారు 17 రైళ్లకు అంతరాయం ఏర్పడింది.