యూపీలో ఘోరప్రమాదం: 13 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌,(జనంసాక్షి): బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సుట్రక్కును ఢీకొట్టి జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.