యూపీలో పిడుగుపాటుతో ఐదుగురు మృతి

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ లో వేర్వురు ప్రాంతాల్లో పిడుగు పడి అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఫజియాబాద్‌ జిల్లాలోని మెచ్చురాహి గ్రామంలో ఓ ఇంటిపై పిడుగుపాటు పడటం వల్ల మక్బుల్‌ ఆహ్మద్‌, రామ్‌ బాలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
అలాగే అంబేద్కర్‌ నగర్‌ జిల్లాలోని మహాయన్‌ గ్రామంలో పొలం పనులు చేసుకొంటున్న రైతు రాజేంద్ర రాజేంద్ర అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. సుల్తాణ్‌పూర్‌ జిల్లాలోని రసూల్‌పూరా గ్రామంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు అబ్దుల్లా, అస్లాంలు పాడుగుపాటు వల్ల మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.