రక్తదానం చేసేవారి ఫోటో తప్పనిసరి

గౌహతి,(జనంసాక్షి): రక్తదానం చేసే వారి ఫోటో తప్పనిసరిగా తీసుకోవాలని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. అన్ని బ్లడ్‌ బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. అస్సాంలో హెచ్‌ ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించిన సంఘటన సృష్టించింది. ఈ నేపథ్యంలో శర్మ బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..రక్త దానం చేసిన వారి ఫోటోలతో పాటు వారి పేర్లను అధికారిక రిజిస్టర్‌లో రాసి ఉంచాలని చెప్పారు. అనూహ్య సంఘటనలు ఏమైన జరిగినప్పుడు ఫోటోలు, ఇతర వివరాలు ఉపయోగపడతాయని వివరించారు.