రమాదేవి మృతికి సోనియా సంతాపం
హైదరాబాద్; కర్నాటక మాజీ గవర్నర్, దేశ తొలి మహిళా సీఈసీ, ప్రముఖ సాహితీవేత్త వీఎస్ రమాదేవి మృతిపట్ల కాంగ్రేస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు. రమాదేవి కుటుంబ సభ్యులకు లేఖ ద్వారా ఆమె తన సంతాప సందేశాన్ని పంపించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోనియా సందేశాన్ని రమాదేవి కుటుంబ సభ్యులకు అందించేయనున్నారు.