రాందేవ్‌ ట్రస్టుకు రూ. 5 కోట్ల జరిమానా

ఢిల్లీ: పన్నులు కట్టనందుకు బాబా రాందేవ్‌ ట్రస్టుకు ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా జరిమానా విధించింది. హరిద్వార్‌కు చెందిర పతంజలి యోగాపీఠ్‌ అండ్‌ దివ్య యోగా ట్రస్టు శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బు తీసుకుంటోంది. కాబట్టి ఇది వాణిజ్యం కిందికి వస్తుందని, ఆందుకుగాను సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టాలని రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు అలాంటి పన్నులు కట్టనందుకు రూ. 5.14 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ట్రస్టుకు నోటీసు ఇచ్చారు. ఈ మొత్తం 2007-08 సంవత్సరం నుంచి 2011-12 సంవత్సరం వరకు జరిపిన లావాదేవీలకు వర్తిస్తుందని నోటీసు పేర్కొంటోంది.