రాజీనామాలు సమర్పించేందుకే ఢిల్లీకి వచ్చాం
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో వెనకుడుగు వేసేది లేదని ఢిల్లీకి వచ్చిన ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అధినేత్రికి రాజీనామాలు సమర్పించేందుకే దేశరాజధానికి వచ్చినట్లు వారు తెలిపారు. వయలార్ రవి పిలిస్తే వచ్చామని.. ఆయన చెప్పేది వినడం తప్పా తామేమి చెప్పమని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.