రాజ్యసభకు ప్రధాని నామినేషన్
గువాహటి, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసోం నుంచి 21 సంవత్సరాల రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మన్మోహన్ ఐదో దఫా నామినేషన్ సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసోం అసెంబ్లీ ప్రిస్సిపల్ కార్యదర్శి బీపీ దాస్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రధాని రాజ్యసభ సభ్యత్వం గడువు జూన్ 14 తో ముగియనుంది.