రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

చెన్నై: తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి కనిమొళి, విజయ్‌కాంత్‌ పార్టీ నుంచి ఇళంగోవన్‌, సీపీఐ నుంచి డి.రాజా బరిలో ఉన్నారు.