రాజ్‌కుంద్రాను ప్రశ్నిస్తున్న ఢల్లీి పోలీసులు

ఢల్లీి : ఐపీఎల్‌లో బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలకు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమానుల్లో ఒకరైన రాజ్‌కుంద్రాను ఢల్లీి పోలీసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించేటప్పుడు ఆ జట్టుకు చెందిన బౌలర్‌ సిద్ధార్థ్‌ త్రివేది కూడా కుంద్రా వెంట ఉన్నారు. అప్రూవర్‌గా మారిన త్రివేది గత వారమే పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.