రాజ్కుంద్రాను సస్పెండ్ చేసిన బీసీసీఐ
న్యూఢిల్లీ, (జనంసాక్షి): బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ సహయ.మాని రాజ్కుంద్రా వేటు పడింది. కుంద్రాను బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఈ రోజు అత్యవసరంగా సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని బీసీసీఐ తెలిపింది. బెట్టింగ్లకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట రాజ్కుంద్రా అంగీకరించిన విషయం తెలిసిందే.