రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌ కె అద్వానీ ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ- జేడీయూ తెగతెంపుల వ్యవహారంపై అద్వానీ అసంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. ఎన్‌డీఎ చీలికకు మోడీ విషయంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ తీరే కారణమని అద్వానీ పేర్కొన్నారు.