రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం

విశాఖపట్నం: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో…. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా లేకపోవటం, అకాశంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడటక పోవటం, పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం మీదుగా వేడి గాలులు వీస్తున్నందున… ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి బలహీనంగా ఉన్నందున రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.