రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు. అనంతపురం, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించనున్నారు. వచ్చే 6 నెలల్లో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తక్కువ వ్యయంతో విమానాశ్రయాల నిర్మాణాన్ని ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేపట్టనుంది.