రాష్ట్రపతిని కలిసిన తెదేపా బృందం

న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై తెదేపా బృందం రాష్ట్రపతిని కలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని వినతి పత్రం సమర్పించారు.