రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా కార్మిక శౄఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. బీసీ సంక్షేమం, సాంఘీక, మైనార్టీ, మత్స్య, ఎక్సైజ్‌, అటవీ, పర్యావరణ, పురపాలక, స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అసంఘటిత కార్మికులు తరపు ప్రతినిధులుగా ఆరు బిభాగాలకు చెందిన వారితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ బోర్డులో సభ్యులుగా వుంటారు.