రాహుల్‌ పార్ట్‌టైమ్‌ లీడర్‌

ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్‌ విమర్శలు

భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహన లేదని, స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటారని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. రాహుల్‌ రాజకీయ లబ్ధి కోసమే ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలోని సమస్యల గురించి రాహుల్‌కు అవగాహన లేదని, అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హావిూలను కాంగ్రెస్‌ ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ప్రజల మద్దతు ఉండడం వల్లే ఆయన గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారన్నారు. అర శతాబ్దంపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పేదరికాన్ని మరింత పెంచిందని ఫడ్నవిస్‌ ఆరోపించారు.