రాహుల్ రాకతో ఆ రెండు పార్టీలకు వణుకు
వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే: శశిధర్ రెడ్డి
మెదక్,ఆగస్ట్16(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనీ, దేశంలో అధికారంలోకి వచ్చి తీరుతుందని గట్టిగా చెప్పగలమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు కొత్తేవిూకాదని, అలాంటి సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త ఉత్సాహంతో పుంజుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. అసలంటూ రాహుల్ గాంధీని నాయకుడిగా ఒప్పుకోలేని వారు ఇప్పుడాయన దూకుడుతో భయపడుతున్నారని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని రాహుల్గాంధీ చెబుతున్నప్పుడల్లా బిజెపిలో ఎదురుదాడి చేస్తోందని అన్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు రావన్న విషయం ఇప్పుడిప్పుడే వారికి కూడా బోధపడుతోందని అన్నారు. దేశంలోని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి.. బీజేపీ మెడలు వంచాల్సిన అవసరం వుందని చెప్పడంలో రాహుల్ విజయం సాధించారని అన్నారు. ఈ క్రమంలో అందర్నీ కలుపుకుపోతాం.. అని రాహుల్గాంధీ దూసుకుని పోతున్నారని అన్నారు. హైదరాబాద్ సబతో అటు బిజెపి, ఇటు టిఆర్ఎస్ ఉలిక్కి పడుతున్నాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన స్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని బిజెపి ప్రచారం చేసుకుంటే సరిపోదన్నారు. ప్రజల్లో ఎంతగా ఆగ్రహం గూడుకట్టుకుందో రాహుల్ సభకు వచ్చిన జనాలను, వారి స్పందనను చూస్తే తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో పర్యటించిన రాహుల్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలతో ఆ పార్టీకి మింగుడు పడడం లేదన్నారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్లోనూరాహుల్గాంధీ పర్యటించబోతున్నారు.. అక్కడా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైభవం తీసుకుని రాగలరని అన్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలమైన శక్తిగా మారి మరింతగా రాటుదేలుతుందని వశిధర్ రెడ్డి అన్నారు. ఈ భయమే టిఆర్ఎస్, బిజెపిల పుట్టి ముంచుతుందని అన్నారు.



