రియలర్ట్‌ భాస్కరెడ్డి హత్యకేసులో బాబా అరెస్ట్‌

హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రియల్టర్‌ భాస్కర్‌ రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్రిలోక్‌ నాథ్‌ బాబా అనే నిందితుడిని సైబరాబాద్‌ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం.. కేరళలో అదుపులోకి తీసుకుంది. బాబాతో పాటు పోలీసుల అదుపులో మరో నిందితుడు కార్తిక్‌ కూడా ఉన్నట్లు సమాచారం. భాస్కర్‌ రెడ్డి హత్యకు ముందు ఆహారంలో.. కార్తీక్‌ మత్తు మందు కలిపినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు మల్లేష్‌, సుధాకర్‌, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ డాక్టర్‌లను విచారించారు. అలాగే హైదరాబాద్‌ టూ శ్రీశైలం సీన్‌ను రీ కన్ట్సక్షన్ర్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీ ఫుటేజ్‌ , కాల్‌ సీడీఆర్‌ ఆధారంగా ఇతరుల పాత్రపై విచారిస్తున్నారు. అదేవిధంగా గుప్తనిధులు, రియల్‌ ఎస్టేట్‌ గొడవలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.