రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలిరియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలి – తాడూరు సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 16 : రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలని తాడూరు గ్రామ సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని తాడూరు గ్రామంలో 219, 197, 198 సర్వే నంబర్లలో రైతుల వద్ద ఉన్న భూమిని గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేసి బడుగు బలహీన వర్గాలకు తలా ఒక్కరికి ఎకరం చొప్పున పంపిణీ చేశారన్నారు. ఆ భూమిని ప్రస్తుతం కొందరు రియల్టర్లు పట్టా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని నిరు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.