రుణమాఫీ పేరుతో మోసం చేశారు: బిజెపి

ఆదిలాబాద్‌,మే31 (జనంసాక్షి):రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేసిందని ఆదిలాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే పాయలశంకర్‌ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక పోగా నిరుద్యోగు లకు భృతి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించలేదన్నారు. ఫసల్‌భీమా కింద డబ్బులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. అలాగే ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో చిత్తశుద్ది లేదన్నారు.