రూపాయి పతనంపై ఆందోళన వద్దు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనంపై ఆందోళన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంపుపై జులై మూడో వారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.