రూ.10,000 ఆర్థిక సాయం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని 6వార్డ్ మెంబర్ ఇరుగురాల లక్ష్మీ-నారాయణ కుమార్తె చనిపోయినందున సాన లక్ష్మమ్మ గోపయ్య జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సాన రామకృష్ణారెడ్డి ఆదివారం పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు , బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్, కమాన్పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.