రెండు రాష్ట్రాల్లో పరిపాలన భేష్ : గవర్నర్‌ నరసింహన్‌

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌, హోంశాఖ కార్యదర్శిని గవర్నర్‌ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజనలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. ఇది సాధారణ పర్యటన మాత్రమే అని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతతో వ్యవహరిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు.